ఆమె బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సిఈఓ.. పేరు సుచనా సేథ్. ఆమె ఓ ఘాతుకానికి ఒడిగట్టింది, తన నాలుగేళ్ల కొడుకును గోవాలో చంపి.. ఓ ట్రావెల్ బ్యాగ్ లో శవాన్ని పెట్టుకుని కర్ణాటకకు ప్రయాణించింది. ఆమె బిడ్డని ఎందుకు చంపిందో తెలియలేదు. నార్త్ గోవాలోని కండోలిమ్ ప్రాంతంలో ఉన్న సర్వీస్ అపార్ట్ మెంట్ నుంచి సోమ వారం ఉదయం సుచనా సేథ్ బెంగళూరుకు ప్రయాణమైంది. ఆమె వెళ్లిన తర్వాత అపార్ట్ మెంట్ ను శుభ్రం చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది రక్తపు మరకలను గుర్తించి పోలీసులకు తెలిపారు.
గోవా పోలీసులు సుచనా సేథ్ విషయంలో కర్ణాటక పోలీసులను అప్రమత్తం చేయడంతో అప్పటికే కర్ణాటకకు తిరిగి వచ్చిన ఆ మహిళను చిత్రదుర్గ జిల్లా మంగళ పోలీసు స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. సుచనా సేథ్ ను గోవాకు తీసుకురావ డానికి పోలీసు బృందం కర్ణాటకకు చేరింది. ప్రస్తుతం ఆమెను గోవా కు తీసుకువెళ్లారు.