మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహశీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదార్ పాసు పుస్తకం జారీ చేసేందుకు తహశీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి సమాచారంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తహశీల్దార్ సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహశీల్దార్ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్టు డ్రైవర్ బద్రి అంగీకరించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహశీల్దార్ సత్యనారాయణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ వలలో శామీర్పేట తహశీల్దార్ సత్యనారాయణ
0
532
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


