ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు 2024ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రవేశపెట్టారు. డెహ్రాడూన్ లో అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లు ప్రవేశపెడుతూ..ఇదో చరిత్రాత్మక ఘట్టంగా ముఖ్యమంత్రి వివరించారు. యూసీసీ వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని..బిల్లు విష యంలో ఏవర్గం కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి హామీ ఇచ్చారు. బిల్లుపై సభలో సానుకూల రీతిలో చర్చించాలని సభలోని అన్ని పార్టీల సభ్యులను కోరారు. కాగా, సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సంద ర్భంగా వందే మాతరం, జై శ్రీరాం నివాదాలు చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఉత్త రాఖండ్ ప్రభుత్వం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పౌరస్మృతి ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.
ఈ బిల్లును ఫిబ్రవరి 4 న ధామి మంత్రివర్గం మొదట ఆమోదించింది. యూసీసీ బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా.. భారతదేశంలో మొదటి ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. గోవాలో పోర్చు గీస్ పాలన కాలం నుండి యూసీసీ అమలులో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ బిల్లు ప్రకారం వివాహం, వారసత్వం, విడాకులు, దత్తత, మెయింటెనెన్స్ తదితర విషయాల్లో అన్ని మత వర్గాలకు ఈ చట్టం వర్తిస్తుంది. వివాహం, సహజీవనం కూడా ఇక ముందు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.