Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఈసారి వల్లభనేని గెలుపు సాధ్యమేనా ?

          రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎవరు రేస్‌లో ఉండబోతున్నారో రాజకీయ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే లకు షాక్ ఇస్తుంటే టీడీపీ మాత్రం జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల జాబితా ఆలస్యం అవుతుంది. దీంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటు న్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కృష్ణా జిల్లాలోని హాట్ టాపిక్‌గా ఉండే గన్నవరం నియోజకవర్గం పై వైసీపీ అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. అసలు గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ? ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? కనపడని ఆ ఎమ్మెల్యే ఎవరు?

      గన్నవరం నియోజకవర్గం అంటే ఎప్పుడు చర్చలకి దారితీస్తుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 లో వరుస విజయాలు నమోదు చేసుకున్న టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ. 2019 ఫ్యాన్ వేవ్ లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ పై గెలిచి టీడీపీ జెండా ఎగరేశారు వల్లభనేని. అయితే వైసీపీ అధికారం దక్కించుకోవటంతో.. వల్లభనేని వంశీ స్టాండ్ మారింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గా నిలిచా డు. వైసీపీ కండువా కప్పుకోకుండానే వైసీపీకి అనుకూలంగా ఉండటంతో పాటు తన కార్యాలయానికి వైసీపీ జెండాలు ఎగరవేశారు. అంతే కాకుండా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ని సైతం విమర్శలు చేసి వైసీపీ అధిష్టానం దృష్టిలో వల్లభనేని మార్క్ సంపాదించుకున్నాడు.

        ఇప్పుడు అసలు యుద్ధం గన్నవరంలో మొదలైంది. గన్నవరం వైసీపీలో యార్లగడ్డ వర్గం, వల్లభనేని వంశీ రెండు వర్గా లుగా ఏర్పడ్డాయి. వల్లభనేని వంశీ వైసీపీలోకి రావటం పై యార్లగడ్డ అసంతృప్తి వ్యక్తంచేశారు. అధిష్టానం మాత్రం అందరు కలిసి ముందుకెళ్లాలని సూచించినప్పటికి యార్లగడ్డ ససేమిరా అనడంతో వైసీపీ, యార్లగడ్డని దూరం చేసు కుంది. కొన్ని అనూహ్య పరిణామాలతో యార్లగడ్డ టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో వల్లభనేని ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా.. అసలు నియోజకవర్గంలో సైలెంట్ అయ్యే పరిస్థితులకి వచ్చాయి.

          గత కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న వల్లభనేని అసలు ఎక్కడ కనిపించటం లేదనే చర్చలు జరుగుతున్నాయి. వేర్ ఈజ్ వల్లభనేని అంటూ కృష్ణా జిల్లా మొత్తం జోరందుకుంది. గన్నవరంలో క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల్లో ఎమ్మెల్యే వల్లభనేని హాజరు కాకపోవటం పై అందరికి సందేహాలు రేకేత్తుతున్నాయి. గన్నవరం పార్టీ కార్యాలయంలో, అలాగే పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కూడా వల్లభనేని సమావేశాలు లేవంటున్నారు స్థానికులు. ఈ మౌనం వెనుక కారణం యార్లగడ్డ టీడీపీకి వెళ్ళటమే అంటూ యార్లగడ్డ వర్గీయులు ట్రోల్స్ మొదలు పెట్టారు.

       ఓపక్క అధికార పార్టీ అభ్యర్థుల జాబితాలపై కసరత్తు చేస్తుంటే.. వల్లభనేని స్థానం ఎక్కడనుంచి ఉండబోతుం దనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి వల్లభనేని బరిలోకి దిగితే మాత్రం ఈసారి గెలుపు అంత సులువు కాదంటున్నారు నియోజకవర్గ ఓటర్లు. జాతీయ స్థాయి నాయుకుడైన చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించటం పట్ల నందమూరి అభిమానులు సైతం వల్లభనేని పై కోపంతో రగిలిపోతున్నారని సర్వే ఆధారంగా వెల్లడైంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వల్లభనేని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారా లేకపోతే మౌనంగానే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్ నమోదు చేసుకోటమే కాకుండా మంత్రి పదవి సైతం ఆశించవచ్చని వల్లభనేని అనుచరులు భావిస్తున్నారు. మరి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకి వల్లభనేని కనిపిస్తారని ఆశిస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్