Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

అయోధ్య రామ మందిరంతో బీజేపీ రాజకీయం

         కాదేదీ కవతకు అనర్హం అన్నారో కవి..! అదే రీతిలో కాదేదీ రాజకీయానికి అనర్హం అంటున్నారు మన నేతలు. అవు ను.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి వేళ ఆ రామయ్య చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ మొత్తం కార్యక్రమాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది అని ఆరోపిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు. అంతేకాదు.. తాము వచ్చేది లేదంటూ తేల్చిచెబుతున్నారు. ఇలాంటి వేళ అసలు ఎందుకీ పరిస్థితి. లోపం ఎక్కడుంది ?

         అయోధ్య రామ మందిర నిర్మాణం..కోట్లాది మంది భారతీయుల కల. అసలు రాముడంటేనే భారతీయుల ఆచార వ్యవహారాలు, సెంటిమెంట్లతో ముడిపడిన దేవుడు. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని, అందు లో తమ దేవుడు రామయ్యను ఆ రెండు కళ్లారా చూడాలని కోట్లాదిమంది భారతీయులు కలలు కన్నారు. సరిగ్గా ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చేసింది. ఈనెల 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రం నిర్వహించను న్నారు. ప్రధాని మోడీ స్వయంగా ఆ శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకురానున్నారు. అలాంటి మహత్తర క్షణాల కోసం యావత్ భారతమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అంతా ఎదురుచూస్తున్నారు. అందుకే ప్రపం చం లోని పలు చోట్ల ఈ మహత్తర ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

        ఇంతటి కీలకమైన కార్యక్రమం చుట్టూ ఇంకా చెప్పాలంటే ఆ అయోధ్య రామయ్య చుట్టూ రాజకీయాలు జోరుగా సాగు తున్నాయి. ఈ క్రెడిట్ అంతా పైకి చెప్పకపోయినా తమదే అంటున్నారు కమలనాథులు. ఇంకా చెప్పాలంటే రానున్న ఎన్నికల కోసం బీజేపీ ప్రచార అస్త్రంగా, అంశంగా ఈ అయోధ్య రామమందిర నిర్మాణ అంశం మారుతుందని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

          ఇంతవరకు బాగానే ఉన్నా.. రామమందిర్ ట్రస్టు, వీహెచ్‌పీ నేతలు కలిసి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖు లకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ కోవలోనే తాను విగ్రహ ప్రతిష్టకార్యక్ర మానికి హాజరుకాబోవడం లేదన్నారు పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద. వాస్తవానికి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విధి ప్రకారం జరగాలని కానీ ప్రస్తుతం అలా జరగడం లేదన్నారాయన. తన మఠం పరిధి ప్రయాగ వరకు ఉన్నా. ఒక్కరూ కూడా తమ సలహాలు, సూచనలు కోరలేదని చెప్పుకొచ్చారు.

          అంతేకాదు.. అసలు రామమందిర నిర్మాణం కోసం కృషి చేసిన బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి వారికి ఆహ్వానం అందిస్తూ చెప్పిన విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. పెద్ద వయసు కారణంగా అద్వానీ, జోషి లాంటి వారిని వయసురీత్యా కార్యక్రమానికి రావద్దని చెప్పామంటూ…ఆహ్వానించి వాళ్లు చెప్పడం విమర్శలకు దారి తీసింది. అదే సమయంలో అద్వానీ, జోషి సమకాలికులు అయిన దేవెగౌడ లాంటి వారిని ఆహ్వానిస్తూ వారిని వద్దని చెప్పకపోవడం మరింత వివాదమైంది. ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలి చిందన్న విమర్శలు తలెత్తాయి. చివరకు వీహెచ్‌పీ వాళ్లు జోక్యం చేసుకొని సర్థి చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావడానికి కారణం ఏంటి ? తెరవెనుక ఏం జరిగిందన్నది అందర్నీ ఆలోచించేలా చేసింది.

        మరోవైపు రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. కేవలం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చిందని విమర్శించారు హస్తం పార్టీ నేతలు. అందుకే ఆలయాన్ని హడావిడిగా ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. రాముని అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నామంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్నిఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కమలనాథులు. అసలు రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని, రాముడి అందరికీ దేవుడంటూ చెప్పుకొచ్చారు ఎంపీ బండి సంజయ్. ఓవైపు లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా పలు విమర్శ లకు, వివాదాలకు కారణంగా మారుతోంది. మరి ఇదంతా ఎవరికి వరంగా మారుతుంది ? ఇంకెవరికి శాపంగా మిగులుతుంది అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్