ఉభయగోదావరి జిల్లాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన

     జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఏపీలో ఎన్నికలు ముంచుకొ స్తున్న వేళ.. రాజకీయ యాత్రలకు మళ్లీ రెడీ అవుతున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధం అవుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు చేపట్టనున్నారు పవన్. ఈ ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించ బోతున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్‌. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో పవన్‌ పర్యటన ఉంటుంది.

      రెండు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో కలిసి వెళ్ళేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా వివాదాలు, విభేదాలు తెర పైకి వస్తూ ఉండ డంతో…ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమా చారం. దీనిలో భాగంగా పవన్ తొలి దశలో టీడీపీ, జనసేన పార్టీల నేతలతో భేటీ అయి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్ళేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు జనసేనాని‌. ఇక రెండో దశ పర్యటనను పవన్ కల్యాణ్‌ ఇదే నెలలో చేపట్టనున్నారు. ఆ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు.. పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కల్యాణ్ పర్యటన ఉండబోతోంది. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పవన్ దిశా నిర్దేశం చేయ నున్నారు. టీడీపీతో కలిసి వెళ్ళే అంశం, పొత్తుల విషయంలో టీడీపీతో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పదే పదే చెప్తున్న పవన్‌.. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించేలా సొంత పార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేయనున్నారు.

      మూడో దశ పర్యటనలో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్‌. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పవన్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి వెళ్ళే అంశంపై చంద్రబాబు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో, అదే బాటలో పవన్‌ ప్రచారం ఉంటుందని చెబుతున్నారు. ఇక పవన్ పాల్గొనే ప్రతి సభలోనూ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ముఖ్య నేతలను అహ్వానించేలా ఏర్పాట్లు చేస్తోంది జనసేన. తొలి రెండు దశలు అనుకున్నట్లు సాగితే.. మూడో దశలో పవన్‌ ఎన్నికల ప్రచారం ఈ నెలాఖరు నుంచే ఉంటుందంటున్నాయి జనసేన వర్గాలు. మరోవైపు జనసేన నేతలకు పవన్‌ కల్యాణ్ లేఖ రాశారు. పొత్తులపై బహిరంగ విమర్శలు చేయొద్దంటూ పార్టీ శ్రేణులకు ఆ లేఖలో సూచించారు. అభిప్రాయ భేదాలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. మరో రెండు మూడు రోజుల్లో పోటీ చేసే స్థానాలపై పార్టీ లీడర్లకు, కేడర్‌కు పవన్‌ స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్