తెలుగు దేశం పార్టీకి 4 సీట్లే వస్తాయంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబూ ! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో టీడీపీకి వచ్చింది 23 స్థానాలే వచ్చినట్లు పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి. ఈ సారి తమ పార్టీకి చెందిన నలుగురిను కొన్నావు అంటూ చురకలు అంటించారు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? అంటూ సెటైర్లు వేశారు. ఈ లెక్కన టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి, నీ మీద జాలేస్తోందని ఎద్దేవా చేశారు.