స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ తెలంగాణలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తాజాగా హైదరాబాద్ లో పత్రికా ప్రకటన విడుదల చేసారూ. అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారు తెలంగాణలో పర్యటించి విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారని ఈ అందర్బంగా వెల్లడించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. అక్టోబరు 20 వ తేదీన అంటే ఇవాళ దుబ్బాకలో నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారు పాల్గొనున్నారు. అనంతరం రాత్రి 7 గం.లకు హైదరాబాద్ లోని అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో బిజెపి ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇక బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ఆడపడచులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామని వెల్లడించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.
నేడు తెలంగాణలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారం
0
282
Latest Articles
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -
- Advertisement -


