ప్రముఖ కోలివుడ్ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి (53) మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోలివుడ్ లో చక్రవర్తి అనేక సినిమాలు చేశారు. ఈ సినిమాల్లో ఎక్కువ సినిమాలను హీరో అజిత్తో చేశాడు. అలాగే శింబు నటించిన కాలై, వాలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. కోలీవుడ్లో నిర్మాతగా హీరో అజిత్తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే సినిమాలను తెరకెక్కించారు. చక్రవర్తికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చక్రవర్తి ఇకలేరు అన్న వార్తతో షాక్కు గురైన కోలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ లో సంతాపం తెలియజేస్తున్నారు.
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కోలివుడ్ నిర్మాత మృతి
0
346
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


