మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. భద్రత దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. సమస్యత్మక కేంద్రాలలో సెంట్రల్ బలగాలని రంగంలోకి దించామన్నారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో 16 కోట్ల రూపా యల వరకు డబ్బులు పట్టుకున్నామని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరు బాధ్యతా యుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో వోటింగ్ నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.