స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను చంపేస్తానని బెదిరింపు మేసేజ్ లు పంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతను పూణెకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 32 ఏళ్ల సాగర్ బార్వేగా ఫేస్బుక్ ద్వారా శరద్ పవార్కు హెచ్చరికలు పంపాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా వస్తున్న బెదిరింపులపై పవార్ కుమార్తె సుప్రియా సూలె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14 వరకు కోర్టు అతడిని రిమాండ్కు పంపింది. బార్వే ఫేస్బుక్ ద్వారా శరద్ పవార్కు హెచ్చరికలు పంపాడు. బార్వే ఫేస్బుక్లో శరద్ పవార్ను హెచ్చరిస్తూ చేసిన పోస్టులో.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్కు పట్టిన గతే శరద్ పవార్కూ పడుతుందని హెచ్చరించాడు. నరేంద్ర దభోల్కర్ను 2013లో బైక్పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ బెదిరింపుపై ఎన్సీపీ కార్యకర్త ప్రత్యేకంగా లోక్మాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు బార్వేను అరెస్ట్ చేశారు. ట్విట్టర్ ద్వారా బెదిరించిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
శరద్ పవర్ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
0
254
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


