అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాకినాడ జిల్లా ముమ్మడి వరం జనసేన టికెట్ ఆశించిన పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతు న్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీకి ముమ్మడివరం టికెట్ కేటాయించడంతో పితాని బాలకృష్ణ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలకపాన్పు ఎక్కిన పితాని అమరావతిలో పవన్ను కలిసి తన రాజకీయ భవిష్యత్పై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అయితే ఆ చర్చలు ఎంతవరకు సఫలీ కృతమయ్యాయో తెలియదు కానీ పితాని బాలకృష్ణ మాత్రం జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరుతు న్నట్లు తెలుస్తోంది.శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ ముమ్మడి వరం నియోజక వర్గంలో బలమైన నాయకుడు. గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణనే తొలి అభ్యర్థి గా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే ఇప్పుడు సీటు కేటాయించకపో వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పితాని. తాజాగా వైసీపీ అధిష్టానం నుంచి పితానికి గట్టి హామీ రావడంతో ఆయన అధికార వైసీపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.