Murder | భార్యను కొట్టి చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఒంగోలులోని విరాట్నగర్లో అంజిరెడ్డి, పూర్ణిమ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్ళై కొన్నేళ్లు అయినా.. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరేది కాదు. తరచు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. కుటుంబ కలహాలు చెలరేగి మాటలతోమొదలైన యుద్ధం.. పోట్లాడుకునే దాకా వచ్చింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన భర్త అంజిరెడ్డి.. భార్య పూర్ణిమను చపాతి కర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడే మృతి చెందింది. దీంతో భయబ్రాంతులకు గురైన అంజిరెడ్డి.. అక్కడినుంచి వెంటనే పారిపోయి.. ఇక చేసేది ఎం లేక.. కొత్తపట్నం వద్ద సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
భార్యను చంపేసి… ఆత్మహత్య చేసుకున్న భర్త
0
455
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


