31.4 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం

పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబరు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించినా కొన్నిచోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014-19లో టీడీపీ హయాంలో 5రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను.. గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్‌ కార్యాలయాలకు కేటాయించింది.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి, వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించనిచోట కొత్త క్యాంటీన్‌ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలివిడతగా వంద క్యాంటీన్లను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్