ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పట్నుంచి ఓ లెక్క అన్నట్టుంది ఏపీ పరిస్ధితి. ఘోర పరాజయంతో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ స్థానంలో కూటమి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించే పనిలో పడ్డారు అధికారులు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ఫోకస్ పెంచారు అధికారులు. సూపర్ సిక్స్తో ప్రచారంలో భాగంగా పలు హామీలు ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో నాణ్యమైన మద్యాన్ని అందించడం అందులో ఒకటి. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఏపీలో మద్యం పాలసీని మార్చేందుకు ఏర్పాట్లు జరుగు తున్నాయి.
కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగే సూచనలు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కింగ్ ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ కింగ్ దిఫిషర్ చీర్స్’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆహా ఎంత గుడ్ న్యూస్ చెప్పారండీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు లిక్కర్ ప్రియులు. మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్లే, నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు మద్యం పాలసీపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం రాగానే వైసీపీ గవర్న మెంట్ తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసి, కొత్త మద్యం పాలసీని తీసుకొస్తారని ప్రచారం తెలుస్తోం ది. డిస్టలరీస్ లైసెన్సులను క్యాన్సిల్ చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఉన్న 3,600 లిక్కర్ షాపులను టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని భావిస్తు న్నారు. డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాపుకి 45,000 – అర్బన్ ఏరియాలో 55,000 డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు జరుపుతున్నారట. కల్తీ మద్యం లేకుండా, తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పులు చేయబో తున్నారని తెలుస్తోంది.