TS TET Notification: టెట్‌ నోటిఫికేషన్ విడుదల..సెప్టెంబర్‌ 15న పరీక్ష

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు టెట్ అప్లికేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు నిర్వహిచనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణపై మంత్రి వర్గ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించారు.

 

బీఈడీ అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్‌ నిర్వహణపై రూపొందించిన ప్రతిపాదనలు విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం టెట్‌ నోటిఫికేషన్ రిలీజ్‌ చేశారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు ప్రకటించనున్నారు. అభ్యర్థులు టెట్ వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in …పరీక్ష ఫీజు రూ. 400 చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

 

2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.5 లక్షల డీఎడ్‌, 4.5 లక్షల బీఎడ్‌ అభ్యర్థులు ఉన్నారు. గతంలో టెట్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ మాత్రం ఉండేది. రెండేళ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించింది ప్రభుత్వం. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ వారితో పాటు బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించింది. రాష్టంలో ఇంకా టెట్ క్వాలిఫై కానివాళ్లు 2 లక్షల మంది ఉన్నారు. వీరితో పాటు కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20 వేల మంది ఉంటారు. దీంతో తాజా టెట్‌ కు పోటీ భారీగా ఉంటుందని తెలుస్తోంది.
ముఖ్య తేదీలు
* దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2, 2023
* దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16, 2023
* రాతపరీక్ష: సెప్టెంబర్‌ 15, 2023
* పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
* పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
* పరీక్ష ఫీజు: రూ.400
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్‌ 27, 2023
* పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tstet.cgg.gov.in/

Latest Articles

నా ప్రెస్‌మీట్‌కైనా అనుమతి ఇస్తారా?.. ఎక్స్ వేదికగా కోరిన పవన్ కళ్యాణ్

తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరించడంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు. తన ప్రెస్ మీట్ కైనా అనుమతి ఇస్తారా అని ఎక్స్‌ వేదికగా కోరారు. మీడియా సమావేశానికి అనుమతిస్తారని ఆశిస్తున్నానని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్