31.7 C
Hyderabad
Saturday, May 17, 2025
spot_img

తిరుమలలో టెరరిస్ట్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు వచ్చిన సమాచారం రూమర్స్ అని తేల్చి చెప్పారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. మెయిల్ ద్వారా వచ్చింది ఫేక్ న్యూస్ అని, వాటిని ఎవరూ నమ్మాల్సిన పనిలేదని తెలిపారు. ఎవరో కావాలని మెయిల్ పంపినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కాగా, సోమవారం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భధ్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ పురవీధులు, ఏడు కొండల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌ ను కూడా పరిశీలించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్