అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంతకల్లులో వివాహిత కృష్ణవేణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 24 గంటలు గడుస్తున్నా పోస్టుమార్టం చేయడంలేదని మృతరాలి కుటుంబం ఆసుపత్రి వద్ద రహదారిపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతురాలి బంధువులకు నచ్చజెప్పి మృతదేహానికి శవపరీక్ష చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు.
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
0
221
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


