తెలంగాణ రాజకీయం ఇప్పుడు సింగరేణి చుట్టూ తిరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య సింగరేణి చుట్టూ మాటల యుద్ధం నడుస్తోంది. అసలు ఇప్పుడు ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఎందుకు వేడెక్కాయి.
పదో విడత బొగ్గు గనుల వేలానికి రంగం సిద్దమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. ఈ బ్లాకుల్లో అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీస్ గఢ్ కు చెందిన 15, జార్ఖండ్ కు చెందిన 6, బిహార్, పశ్చిమ బెంగాల్ కు చెందిన చెరో 3 బ్లాకులను వేలం వేయ నుంది. ఇందులో తెలంగాణలోని శ్రావణపల్లికి చెందిన ఒక బ్లాకు కూడా ఈ వేలం జాబితాలో ఉంది. దీంతో సింగరేణి రాజకీయం చిచ్చురగిలింది. పైగా ఈ బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనుండటంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. శ్రావణపల్లిలోని బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ బ్లాకు దక్కించు కోవడానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొననుంది. ఎంఎస్ టీసీ ప్లాట్ ఫామ్ పై వేలానికి సంబంధించిన వివరాలు కూడా పొందుపర్చారు. పర్సంటేజ్ రెవెన్యూ షేర్ మాడల్ ఆధారంగా ఆన్లైన్ లో బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారు. ఇక ఈ గనుల్లో కోకింగ్, నాన్-కోకింగ్ బొగ్గు బ్లాకులు న్నాయి.
తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అని ఈ సంస్థ తెలంగాణకు తలమాని కమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సంస్థ కోసం దేశ ప్రధాన మంత్రి మోడీనీ కలుస్తామన్నారు. భవిష్యత్ లో గోదావరి పరివాహక ప్రాంతంలో గుర్తించబోయే అన్ని గనులను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించేలా ప్రధానిని కోరతామన్నారు. కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనులకు కేంద్రం వేలం పాట నిర్వహించనుందని, ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని మోడీని కలుస్తామని కలుస్తామని తెలిపారు. రాజకీయ లబ్దికోసం బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సింగరేణిని నిట్ట నిలువు నా ముంచే ప్రయత్నం చేసిందన్నారు.
సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో బొగ్గు గనులు వేలం వేయొవద్దని గతంలో మోడీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీజేపీలకు 16 ఎంపీ సీట్లిస్తే రాష్ట్రానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి బొగ్గు గనులను వేలం వేస్తు న్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిందన్నారు. సింగరేణికే గనులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని అని ఆయన మండిప డ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపులు జరగాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మేమే పదేళ్లు సింగరేణిని కాపాడామని మాట్లాడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలోని అన్ని బొగ్గు బావులను సింగరేణికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశి వరావు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో గనులన్నింటినీ సింగరేణికే ఇవ్వాలని గతంలో ఒప్పందం జరిగిందని తెలిపారు. కానీ అందుకు భిన్నంగా డీఆర్ఏ పేరు తో చట్టం తీసుకొస్తే బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏమీ తెలియ నట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వా నిదే పెత్తనం ఉంటుంది. 49శాతంవాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెత్తనమేదీ ఉండదన్నారు. ‘‘సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదని, అది ఎన్నికల వేళ మాజీ సీఎం మదిలో పుట్టిన విషప్రచారమన్నారు. కిషన్ రెడ్డి.