29.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

160 స్థానాలతో టీడీపీ-జనసేన అధికారంలోకి రాబోతున్నాం- అచ్చెన్నాయుడు

స్వతంత్ర వెబ్ డెస్క్: 160 స్థానాలతో టీడీపీ – జనసేన అధికారంలోకి రాబోతున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మనకు తోడుగా జనసేన ఉంది….కరెక్ట్ టైంలో.. మంచి హృదయంతో టీడీపీతో పొత్తు ప్రకటించారని వెల్లడించారు. ఏదైనా జనసేనతో కలిసే వెళ్లాలని.. చంద్రబాబుకు మద్దతిచ్చిన పవనుకు టీడీపీ విస్తృత స్థాయీ సమావేశం కృతఙతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎల్లుండి జనసేనతో సమావేశం ఉంది.. భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. కరవు వల్ల రైతులు తెగ ఇబ్బంది పడుతున్నారని.. కరువుతో అల్లాడుతోన్న రైతులను పలకరిద్దాం.. ఎండిన పంటలను పరిశీలిద్దామని చెప్పారు. జనసేనతో కలిసి ఈ పోరాటం చేపడదామని.. 160 స్థానాలతో టీడీపీ – జనసేన అధికారంలోకి రాబోతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారు….టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు.. దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆగ్రహించారు. భర్త జైల్లో ఉంటే భార్య ఎంతో బాధపడుతుంది…నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్