వైద్యవిద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ..నీట్ నిర్వహణలో చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం ప్రక్రియలో 0.001 శాతం ఉదాసీనత చోటు చేసుకున్నట్లు తెలిసినా, తగిన రీతిలో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
నీట్ పరీక్షను ఈ ఏడాది మే ఐదో తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 4, 750 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహిం చగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే వీరిలో 67 మందికి మొత్తం 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి.అలాగే వీరిలో ఆరుగురు హర్యానా రాష్ట్రం ఫరీదాబాదలోని ఒకే సెంటర్ నుంచి పరీక్షరాడం అనేక అనుమానాలకు తావిచ్చింది. బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ వార్తలను ఖండించాయి. అయితే అంతిమంగా పరీక్ష ముందురోజు రాత్రి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నిర్థారణ అయింది. ఈ విషయమైన పోలీసుల ఎదుట బీహార్లో అరెస్టయిన కొంతమంది విద్యార్థులు అంగీకరించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి బీహార్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగే షన్ టీమ్ను ఏర్పాటు చేసింది. కాగా ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్తో పాటు ముగ్గురు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ విచారించగా ఓ వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. అతడే సంజీవ్ ముఖియా. ప్రశ్నాపత్రం లీకేజ్ రాకెట్ వెనుక ప్రధాన కుట్రదారు అతడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. ఈ రాకెట్లో సంజీవ్ ముఖియానే ప్రధాన కుట్రదారు అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రశ్న పత్రం మొదట అందింది సంజీవ్కేనని తెలుస్తోంది. ఓ ప్రొఫెసర్ ద్వారా పేపర్ తీసుకొని… రాకీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా పాట్నాలోని ఓ బాయ్స్ హాస్టల్ను అద్దెకు తీసుకుని అందులో 25 మంది విద్యార్థులకు వసతి కల్పించినట్లు సమాచారం. వారందరికీ లీకైన పేపర్ ఇచ్చి ప్రిపేర్ చేయించినట్లు కథనాలు వెలువ డుతున్నాయి. ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడిన తర్వాత మే 6 నుంచి సంజీవ్ కన్పించకుండా పోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చినప్పటికీ, కొంతమంది విద్యార్థులు పాత పుస్తకాన్ని చదివి పరీక్షలు రాశారు. పరీక్షా పత్రంలో కొన్ని ప్రశ్నలకు పాత, కొత్త పుస్తకాల్లో వేర్వేరు సమాధానాలు ఉన్నాయి. దీంతో 1,563 మంది విద్యార్థులకు ఐదు ఎక్స్ గ్రేషియా మార్కులు కలిపారు. ఈ అంశంపైన కూడా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఒకే కేంద్రంలోని ఆరుగురికి నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి. దీనిని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో కొంతమంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేయాలని కొంతమంది డిమాండ్ చేశారు. కాగా మరికొంతమంది అసలు పరీక్షనే పూర్తిగా రద్దు చేసి తిరిగి నిర్వహించాలని మరికొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా అసలు పేపర్ లీకేజీ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కూడా పిటీషన్ దాఖలైంది. దీంతో ఈ పిటీషన్ పై సమాధానాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రవేశ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కూడా నోటీసులు పంపింది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై సమర్పించిన అఫిడవిట్లో గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ మార్కులను పొందిన 1, 563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటిం చింది. అయితే గ్రేస్ మార్కులను వదులు కోవాలా లేక మళ్లీ పరీక్షకు హాజరుకావాలా లేక తగ్గిం చిన మార్కులతో అడ్జస్ట్ అయిపోవాలా అనేది విద్యార్థుల నిర్ణయానికి వదలివేస్తున్నట్లు కేంద్రం తెలియ చేసింది. ఈ సమాధానం తరువాత, నీట్ పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించ లేదు. నీట్ పరీక్ష ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్న వ్యవహారమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యా నించింది. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎంతగా కష్టపడి సిద్దమవుతారో గుర్తించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు సూచించింది. అడ్డదారుల్లో నీట్ ప్రవేశ పరీక్ష పాసైతే, అలాంటి విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లుగా ఎటువంటి సేవలు అందిస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇదిలాఉంటే దేశంలో వైద్య విద్యా కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ వల్ల ఎంతో మందివిద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని రాజ్యసభ సభ్యుడు, సీపీఐ నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి బినోయ్ విశ్వం వ్యాఖ్యానించారు. నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బినోయ్ విశ్వం లేఖ రాశారు. ఈ లేఖలో అనేక అంశాలను బినోయ్ విశ్వం ప్రస్తావిం చారు.
రాష్ట్రాలకు ఉన్న హక్కులకు భంగం కలిగేలా, సమాఖ్య విధానానికి తూట్లు పొడిచేలా 2019లో నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందనన్నారు. ఈ చట్టం ఆధారంగా ఎయిమ్స్తో పాటు రాష్ట్రస్థాయి వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నీట్ ను ఏకైక పరీక్షా నిర్ణయించడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించ కుండా నీట్ ప్రవేశపరీక్షా పద్దతిని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిందని బినోయ్ విశ్వంమండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఎన్ని అభ్యంతరాలు వ్యక్త మైనా, కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని అమలు చేస్తోందని బినోయ్ విశ్వం నిప్పులు చెరిగారు. నీట్ వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఆర్థికంగా లాభపడ్డాయని బినోయ్ విశ్వం పేర్కొ న్నారు.