28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

ఏప్రిల్ 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలి: సుప్రీం

Viveka Murder Case |మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏప్రిల్ 30వ తేదిలోగా విచారణ పూర్తిచేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున కాలపరిమితిని విధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రస్తుతం వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రాంసింగ్ ను తొలగించింది. ఆయన స్థానంలో అదనంగా మరో సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో ఇక నుంచి డీఐజీ కేఆర్ చౌరాస్య పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగనుంది. కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్‌ మంజూరు చేయాలని భార్య తులసమ్మ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలుకాకపోతే ఈ కేసులో(Viveka Murder Case) ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

Read Also: AP Group 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా.. కారణాలివే..
Follow us on:   YoutubeInstagramGoogle News

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్