స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 గంటల సమయంలో సెన్సెక్స్ 206 పాయింట్ల లాభంతో 62,635 దగ్గర ఉంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 18,553 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.31 దగ్గర ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయిన జాబితలో ఉన్నాయి.