30.7 C
Hyderabad
Friday, June 9, 2023

రేపు రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్… 1500 మంది పోలీసులతో భారీ భద్రత

IPL Cricket | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఏపీఎల్ పండుగ మొదలైయింది. ఇప్పటికే హైద‌రాబాద్ లో ఐపీఎల్ ఫీవ‌ర్ షురూ అయింది. రేపు మ‌ధ్యాహ్నం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు… స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్రమంలో నగర పోలీసులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. రేప‌టి మ్యాచ్ ఏర్పాట్లు గురించి రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ భద్రతా ఏర్పాట్ల గురించి మీడియాకు వెల్లడించారు. నగరంలో భద్రత కల్పించేందుకు 1500 మంది పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా… అలాగే నగర వాససులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. క్రికెట్ మ్యాచ్(IPL Cricket) ముగిసిన తర్వాత నగరపౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. అలాగే ఆన్ లైన్ లో టికెట్స్ విక్రయాలు జ‌రిగాయ‌ని తెలిపారు. ఎవరైనా బ్లాక్ లో టిక్కెట్లు విక్ర‌యిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తెలిపారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నగరంలో ఎలాంటి అఘాయిత్యాలు జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

Read Also:  మొదలైన ఐపిఎల్‌ మ్యాచ్‌లు.. ఎక్కువ ఆశపడ్డారా.. ఇక అంతే..

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్