కర్నూలు జిల్లా ఆదోని రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరిగారు. ఈనేపథ్యంలోనే ఓ వైసీపీ యువకుడు సిద్ధం జండాలతో కేకలు వేశాడు. దీంతో షర్మిల వైసీపీ నాయకులు దేనికి సిద్ధం అంటూ ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. స్పెషల్ స్టేటస్ తేవడానికి సిద్ధమా, పోలవరం కట్ట డానికి సిద్ధమా, రాజధాని ఏర్పాటుకు సిద్ధమా, సంపూర్ణ మధ్య నిషేధానికి సిద్ధమా, మెగా డీఎస్సీకి సిద్ధమా అంటూ ఓ రేంజ్లో కడిగిపారేశారు.రాజశేఖర్రెడ్డి అసలైన వారసురాలును తానేనని, తనను ఆశీర్వదించాలని కోరింది. అదే విధంగా ఆదోని కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలుపించాలని పిలుపునిచ్చింది.