తిరుపతి జిల్లా నగరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని మాజీ మంత్రి రోజా అన్నారు. రోజా తన కుటుంబ సభ్యులు, నగరి ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని రోజా చెప్పారు. తనను నగరి ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. నగరి ప్రజలకే తన జీవితం అంకితం అని రోజా వెల్లడించారు. రాజకీయ జీవితంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మాజీ మంత్రి చెప్పుకున్నారు. అలాంటి సమయాల్లో నగరి ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని రోజా గుర్తుచేశారు.
నగరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా – రోజా
0
173
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


