తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ఇప్పటివరకు ఎక్కువ వాహనాలతో సాగిన కాన్వాయ్ను నాలుగు వాహనాలకు పరిమితం చేసినట్లు సమాచారం.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను కూడా ప్రధాని తగ్గించుకున్నారు.
ప్రధాని ఇచ్చిన పొదుపు సందేశాన్ని అనుసరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


