లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి హవా చాటడంతో జోష్ మీదున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయన యూపీలోని రాయ్బరేలి, కేరళలోని వయనాడ్ రెండు లోక్ సభ స్థానాల నుంచి రాహుల్ ఘన విజయం సాధించారు. రెండింట్లో ఒకే సీటు నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా రాహుల్ దేన్ని వదులుకుంటారోననే ఆసక్తి దేశ వ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేం దుకు రాహుల్ వయనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కోజికోడ్ జిల్లాలోని తామరస్సేరి రెస్టారెంట్లోకి వెళ్లి వంటలు చేస్తున్న సిబ్బందిని పలకరించారు. సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెస్టారెంట్లోని చెఫ్లు, సిబ్బందితో మాట్లాడిన తరువాత వారితో కలిసి ఫొటోలు దిగారు. తెర వెనక నిశ్శబ్దంగా పని చేసే వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతామని, వారిని కలవడానికే తాను వచ్చానని చెప్పారు. ఇంత మంచి భోజనం వడ్డిస్తున్న చెఫ్లు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అని సోషల్ మీడియాలో చేసిన పోస్టులో రాసుకొచ్చారు.