పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్కు బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదయింది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన రాహుల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.