తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు తెలిపారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్రావును కేసులో ఏ4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్రావు, ఆయన బంధువుల నుంచి కోటి సీజ్ చేశామని అంగీకరించారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి చెందిన 3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామన్నారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు రాధాకిషన్రావు చెప్పారు.