భారతీయులంతా సమాన భావంతో ఐకమత్యంగా జీవించాలనేది ప్రధాని మోదీ లక్ష్యం అని కంటోన్మెంట్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బొల్లారంలోని రిసాల బజార్, గౌతమ్ బజార్, డౌటాన్ బజార్లలో పర్యటించారు. చాంద్ భాయ్ హోటల్ వద్ద విలేకర్లతో వంశ తిలక్ మాట్లాడారు. బిజెపి మత సామరస్యంతో ముందుకు పోతుందన్నారు. ఒక పార్టీకి ఒక దేవుడికి పరిమితం కాకుండా అన్ని మతాల వారు తమ దేవుళ్లను పూజించుకునే హక్కు ఇచ్చిందన్నారు. కంటో న్మెంట్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను వంశ తిలక్ కోరారు.