స్వయంగా పరిపాలించుకొనే బహుజన రాజ్యం కోసం బహుజనులంతా ఐక్యంగా ఉండాలని సికింద్రా బాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి దండెపు బస్వానందం అన్నారు. ముషీరాబాద్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం చేశారు. బహుజనుల పార్టీ అంటే నాలుగు వర్గాల పార్టీ అన్నారు బస్వానందం. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల వారు ప్రజల ధనాన్ని వృథాగా ఖర్చు పెట్టడం ఏమి సమంజసం అని ప్రశ్నించారు. డబ్బులు దండుకునే వాళ్ళే ప్రజలకు ఖర్చు పెడతారని విమర్శించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు దండెపు విజ్ఞప్తి చేశారు.