బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయం వైసీపీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీ నాయకులు మట్టపర్తి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. 2029లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీలకు 88 సీట్లు కేటాయిం చాలని, రిజర్వేషన్లపై కేంద్రం చట్టం చేసినా చేయకపోయినా ఏపీలో ఇది అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట 132 అడుగుల ఎత్తయిన జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ నాయకుల చరిత్రను భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ కోరారు. కోనసీమ అల్లర్ల కేసులను ఎత్తేయాలని మట్టపర్తి డిమాండ్ చేశారు.