చార్మినార్లోని న్యూ లాడ్ బజార్లో అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై H-FAST దాడి చేసింది. FSSAI లైసెన్స్ లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిషేధిత కృత్రిమ ఆహార రంగులను వినియోగిస్తున్నట్లు తేలింది. పదేపదే వాడిన, పాడైపోయిన వంట నూనెతో ఆహారం తయారీ చేస్తున్నట్లు బయటపడింది. అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రైడ్ చికెన్ తయారీ, నిల్వచేస్తున్నట్లు గుర్తించరు.
110 కిలోల ఫ్రైడ్ చికెన్ ,6 టిన్నుల వంట నూనె, కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు, కాలేయ వ్యాధుల ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పదేపదే వాడిన నూనె, కృత్రిమ రంగులతో ఆహారం తయారీ
Latest Articles
- Advertisement -


