స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘శ్రీ శరత్ బాబు గారు విలక్షణమైన, సృజనాత్మక నటుడు.. సుదీర్ఘ సినీ జీవితంలో అనేక భాషల్లో, విభిన్నమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు.. ఆయన మరణించడం విచారకరం.. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు శరత్ బాబు మరణించడం బాధాకరమని ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
కాగా అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాద్ ఫిలిం చాంబర్ తీసుకురాగా.. సీనియర్ నటులు, ఫిలిం చాంబర్ సభ్యులు, ‘మా’ ప్రతినిధులు నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని చెన్నై తరలిస్తున్నారు. రేపు ఉదయం చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Shri Sarath Babu Ji was versatile and creative. He will be remembered for several popular works in several languages during his long film career. Pained by his passing away. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 22, 2023