స్వతంత్ర వెబ్ డెస్క్: కోకాపేట నియో పోలిస్ భూములు అమ్ముడుపోయిన మాదిరిగానే.. మోకిల్లా ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారిడార్కు సమీపంలోని మోకిల్లాలో మొదటి దశలో 50 ప్లాట్లను హెచ్ఎండీఏ సోమవారం వేలం వేసింది. ఈ ప్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ. 121.40 కోట్ల ఆదాయం వచ్చింది. 50 ప్లాట్ల వేలంతో రూ. 40 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాకు మూడు రెట్లు అధికంగా ఆదాయం సమకూరింది. మోకిల్లాలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ. 1.05 లక్షలు పలికింది. చదరపు గజం ధర కనిష్ఠంగా రూ. 72 వేలు పలికింది. సగటున రూ. 80,397 పలికింది.
హాట్ కేకుల్లా అమ్ముడైన మోకిల్లా ప్లాట్లు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం
0
327
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


