33.8 C
Hyderabad
Monday, April 28, 2025
spot_img

రూ.2 వేల కోట్లతో ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రి కేటీఆర్ భూమిపూజ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఇద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీతో కలిసి రూ.2వేల కోట్లతో దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ విస్తరణకు భూమిపూజ చేశారు. అనంతరం బెల్లంపల్లిలో రూ.30 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి.. ఆలాగే రూ.44 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 350 ఎకరాలలో ఆహార శుద్ది పరిశ్రమలకు… 25 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శిలాఫలకం వేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… త్వరలో బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తామని అన్నారు. బెల్లంపల్లి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నైపుణ్య కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.

Latest Articles

‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్