స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ మీషో(Meesho) మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మొత్తం 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్ చేసింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన సిబ్బందికి 3 నుంచి 9 నెలల వేతనాన్ని పరిహారంగా అందజేస్తామన్నారు. వారి పదవి, పనిచేసిన కాలం, జీతం ఆధారంగా పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. అలాగే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడంలోనూ సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా గతేడాది కూడా 250మంది ఉద్యోగులను తొలగించింది.
మరో 250 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ‘మీషో’
0
367
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


