సీఎం రేవంత్ క్రికెట్నే కాకుండా రైతుల గురించి కూడా పట్టించుకోండని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో పాల్గొని ఆయన రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపో యిందన్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ, పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన చెరువులు, కుంటలు, కాలువలు నేడు వెలవెలబోతున్నాయన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మెట్పల్లి పాత బస్టాండ్లో రైతు దీక్షలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే
0
182
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


