స్వతంత్ర వెబ్ డెస్క్: వరల్డ్ కప్ లో రేపు ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. కాగా రేపు జరగనున్న మ్యాచ్ లో ఇండియా రెండు కీలక మార్పులను చేయనున్నట్లు కాసేపటి క్రితమే జట్టు యాజమాన్యం ప్రకటించింది. బంగ్లాదేశ్ తో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్ కు దూరం కానున్న విషయం తెలిసిందే.. అందుకే ఇతని స్థానంలో వరుసగా నాలుగు మ్యాచ్ లేక్యూ బెంచ్ కు పరిమితం అయిన సూర్య కుమార్ యాదవ్ ను ఆడించనున్నారు. ఇక టీం లో వరుస అవకాశాలు దక్కినా తనదైన ముద్ర వేయని శార్దూల్ ఠాకూర్ పై కూడా టీం యాజమాన్యం వేటు వేయనుంది, ఇతని స్థానంలో మహమ్మద్ శమిని తీసుకురానుంది. వీరిద్దరి రాకతో టీం ఇంకా బలంగా తయారయ్యి రేపు జరగనున్న మ్యాచ్ లో కివీస్ ను చిత్తు చేసి విజయం సాధించాలని కోరుకుందాం.
రేపటి మ్యాచ్ లో ఇండియా టీం లో కీలక మార్పులు !
0
292
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


