సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను కేవలం జైలు నుంచి వదిలేయడమే కాకుండా వారికి ఉపాధి కల్పించా లని అధికారులు నిర్ణయించారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు చర్లపల్లి సెంట్రల్ జైలులో జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లల్లో 213 మంది క్షమాభిక్షకు ఎంపిక చేశారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా ద్వారా జైళ్లశాఖ అధికారులు ఉపాధి కల్పించనున్నారు. ఆసక్తి, అర్హత మేరకు విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించనున్నారు. అవసరమైన వారికి అర్హత బట్టి ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.