JEE Main | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల చేశారు అధికారులు. జేఈఈ మెయిన్ ర్యాంకులను శనివారం ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయ దుంధిబి మోగించారు. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు మొదటి ర్యాంక్ ని హైదరాబాద్కు చెందిన విద్యార్థి వెంకట్ కౌండిన్య సాధించాడు. 300 మార్కులకు 300 మార్కులు సాధించిన సింగారపు కౌండిన్య మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఏపీలోని విజయవాడకు చెందిన కే. సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంక్ వచ్చింది. జేఈఈ మెయిన్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటడంతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల
0
349
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


