Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధ్యమేనా?

   భగభగ మండే మంటలు.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాజస్థాన్ లో ప్రజలు పార్లమెంటు ఎన్నిక లకు సిద్ధమవుతున్నారు. నరేంద్రమోదీ హవా మొదలైన తర్వాత రాజస్థాన్ లో 2014, 2019లో ఆ రాష్ట్రం లోని మొత్తం 25 స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా సర్వ శక్తులూ ఒడ్డి, రాజస్థాన్ లో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు కనీసం కొన్ని స్థానాలైనా గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాజస్థాన్ ప్రజలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారు?

రాజస్థాన్ ఓటర్లు విభిన్నమైన సంస్కృతికి ప్రతీక. రాజస్థాన్ లో ఐదేళ్ల కొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే సంస్కృతి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 2014 నుంచి పూర్తిగా బీజేపీ కూటమికే మద్దతు ఇస్తూ వచ్చారు. దీంతో 2014, 2019లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. 2014లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినప్పుడు రాజస్థాన్ లో వసుంధరా రాజే సీఎంగా కాషాయపార్టీయే అధికారంలో ఉంది. 2019 నాటికి రాష్ట్రంలో అశోక్ గెహ్లోట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది. అంటే 25 స్థానాలలోనూ ఘనవిజయం సాధించింది. 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన భజన్ లాల్ శర్మ.. లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించే బాధ్యతలు తన భుజాన వేసుకుని, సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.

    రాజస్థాన్ లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దీనంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇంకా కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది ఇప్పటికే బీజేపీ పంచన చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు 8 వేలమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాషాయం కండువా కప్పుకున్నారు. సీనియర్లు ఎన్నికల్లో ఒటమి భయంతో పోటీకి సిద్ధంగా లేరు. అయినా అశోక్ గెహ్లోట్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నాయకత్వం 25 సీట్లలోనూ అభ్యర్థులను నిలిపింది.దీంతో బీజేపీ – కాంగ్రెస్ మధ్య డైరెక్ట్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. బీఎస్పీ, స్థానిక రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతున్నా.. పోటీ నామమాత్రమే.

     రాజస్థాన్ లో మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఈ సారి రెండుదశల్లో ఎన్నికలు జరుగుతు న్నాయి. తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న, మలిదశ పోలింగ్ ఏప్రిల్ 26న జరుగుతుంది. తొలి దశలో అల్వార్, భరత్ పూర్, బికనీర్, చురు, దౌసా, గంగానగర్, జైపూర్, జైపూర్ రూరల్, ఝుంఝును, కరౌలి-ధోల్పూర్, నాగౌర్, సికార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. రెండో దశలో ఏప్రిల్ 26న అజ్మీర్, బన్స్వారా, బార్మర్, భిల్వారా, చిత్తోర్ గఢ్, జలోర్, ఝలావర్-బరన్, జోధ్ పూర్, కోటా, పాలి, రాజ్ సమంద్, టోంక్-సవాయ్ మాధోపూర్, ఉదయ్ పూర్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. వరుస గా బీజేపీ క్లీన్ స్వీప్ ల వల్ల దెబ్బతిన్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా 5 స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చురు, ఝుంఝుమా, కరౌలీ -ధౌల్ పూర్, టోంగ్ సవాయీ మాధోపూర్, బాడ్ మేర్ స్థానాలను ఎలాగైనా గెలుచుకో వాలని పూర్తి ప్రచార యంత్రాంగాన్ని ఆ స్థానాల్లో మోహరించింది. ప్రధాని మోదీ.. ఆధ్వర్యంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. సీఎం భజన్ లాల్ శర్మ తనవంతు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా బడా నాయకులతో ప్రచారం చేయిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం బోణి కొడుతుందా.. కాషాయం రెపరెప లే ఉంటాయా చూడాలి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్