న్యూ యార్క్ నా సౌవ్ కౌంటీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. పాకిస్థాన్ బ్యాటర్లు తడబడండంతో భారత్ బౌలర్లు అధ్బుతంగా రాణించడంతో టీమ్ ఇండియాను విజయం వరించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 119 పరుగులకే ఆల్ అవుట్ అవ్వగా రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. డాట్ బాల్స్ ఎక్కువ ఆడడం, వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ ఓటమిని చవి చూసింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ వరుసగా రెండో సారి గెలవగా ఆడిన రెండింటిలోనూ పాకిస్థాన్ ఓటమిపాలైంది.