29.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

బీజేపీ పార్టీ శ్రేణుల సంబరాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రధానిగా మోదీ ప్రమాణస్వీ కారం జరిగిన సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుండి గాంధీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

కేంద్ర మంత్రిగా బండి….

కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్‌ని చూడడం కరీంనగర్‌ ప్రజలకు గర్వకారణమని సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవడం దేశ అభివృద్ధికి మరో మైలురా యిని చేరుకోవడమే అని తెలిపారు. దేశ ప్రజలు మొత్తం మోదీ వైపు చూస్తున్నారన్నారు.

బస్సు డ్రైవర్ వీరంగం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బస్టాండ్‌లో ప్రయాణికుడిపై బస్సు డ్రైవర్‌ చేయి చేసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లే బస్సులు రాకపోవడంతో విచారణ అధికారిని హైదరాబాద్‌కు వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని సమా చారం కోసం వెళ్లగా ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు చితకబాదారు. సమాచారం కోసం వెళ్తే దౌర్జన్యం చేస్తున్నా రంటూ తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు.

వేములవాడలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతోఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్ట మైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.

అమర్‌ నాథ్ రెడ్డికి ఘన స్వాగతం

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం దండపల్లి రోడ్డులోని హజరత్ షాహీద్ షా వలి బాబా దర్గాలో ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ రెడ్డి ప్రార్థనలు చేశారు. ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమర్నా థ్ రెడ్డి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అమర్నాథ్ రెడ్డికి మైనార్టీలు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అందు బాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఎనిమిదడుగులు పెరిగిన భక్తుడి కేశాలు

పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండ లానికి చెందిన కొమురయ్య తల వెంట్రుకలు 8అడుగులు పెంచారు. మల్లికార్జున స్వామికి ముడుపు మొక్కుకొని చిన్నప్పటి నుంచి కొమురయ్య వెంట్రుకలు తీయకుండా అలానే ఉంచడంతో 8అడుగులు పెరిగిపోయాయి.

వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా ఇటుకలు తయారు చేసే బట్టీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తుమ్మలూరు గ్రామ పరిధిలో ఇటుకలు తయారు చేసే బట్టిలో అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పరారయ్యారు. హత్యకు గురైన వ్యక్తి ఒడిషాకు చెందిన తులరాంగా గుర్తించారు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోస్ట్ ఆఫీస్ లో చోరి

ఆదిలాబాద్‌ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. బోథ్‌ నియోజకవర్గం ఇచ్చోడలోని పోస్టాఫీసులో దొంగతనం జరిగింది. పోస్టాఫీసులోని డిజిటల్ లాకర్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్