గ్రామీణ విద్యార్థినిలు ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు భరోసా కల్పించే కార్యక్రమాన్ని NTPC యాజ మాన్యం తీసుకోవడం సంతోషంగా ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం NTPC కాకతీయ హాల్లో గరల్స్ ఎంపవర్మెంట్ మిషన్ కార్యక్రమాన్ని ఈడీ కేదార్ రంజన్ పాండేతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత బాలికలకు మనో ధైర్యాన్ని కల్పించేందుకు NTPC యాజమాన్యం కరాటే, యోగా వంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. సాధికారత దిశగా బాలికలను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం ప్రోత్సహించాలన్నారు. బాలికలు సాంకేతికతను ఉపయోగించుకొని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలికల్లో మనోధైర్యాన్ని నింపి భరోసా కల్పించినప్పుడు వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.
రామగుండం ఎన్టీపీసీ కాకతీయ హాల్లో గర్ల్స్ ఎంపవర్మెంట్ మిషన్
0
265
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


