హైదరాబాద్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్( K. T. Rama Rao)కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి జులై 31న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసులో కేటీఆర్తో పాటు మాజీ ఉన్నతాధికారులు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికీ కూడా సమన్లు జారీ చేసింది. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అనుమతుల ప్రక్రియపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్ను ఏ1గా, అరవింద్ కుమార్ను ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చారు. అలాగే కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా, ఎఫ్ఈవో సంస్థను ఏ5గా పేర్కొన్నారు.
2023లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ పేరుతో విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ ఖాతా నుంచి రూ.55 కోట్లు ఎఫ్ఈవో సంస్థకు బదిలీ అయినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది


