హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల చేపట్టిన మహా ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల ధర్నాకు ఆటోలోనే వచ్చారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ఆటో డ్రైవర్లు ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆవేనద వ్యక్తం చేశారు. గతంలో ఆటో డ్రైవర్లు 2 వేలు సంపాదించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు 800 వందలు సంపాదిస్తున్నారని తెలిపారు. రవాణా సంక్షేమ బోర్డు, ఇన్స్యూరెన్స్ హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏడాదికి ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల మహా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి కేటిఆర్
0
152
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


