1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ ధినేత కేసీఆర్ అన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు తాండవించేవని తెలిపారు. తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేదని అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలం గాణ దశాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యావత్ తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలిచావులకు నెలవుగా ఉండేదని చెప్పారు. తాను కూడా అధికార పదవుల్లో ఉన్నానని తెలిపారు. ఆ రోజుల్లో సాటి మిత్రులతో కలిసి తమ దుఃఖాన్ని పంచుకునే వాళ్లం అని గుర్తుచేశారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన మాజీ సీఎం కేసీఆర్
0
379
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


