ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును జులై 31 వరకు పెంచుతూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం జులై 25తో గడువు ముగియగా తాజాగా తుది గడువును ఈ నెలాకరు వరకు పొడిగించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ మేరకు పొడిగించారు. జులై 31 తర్వాత అడ్మిషన్లు పొందే విద్యార్ధులు ఆలస్య రుసుము చెల్లించవల్సి ఉంటుందని తెలిపారు.
ఆగస్టు 1 నుంచి 16 మధ్యలో చేరితే రూ.500 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక డిగ్రీ ప్రవేశాలకు నిర్వహిస్తోన్న దోస్త్‌ మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసే గడువును జులై 28 వరకు పొడిగించారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్‌ చేయాలని అధికారులు పేర్కొన్నారు.

Latest Articles

పుల్వామా దాడుల సూత్రధారి హతం

పుల్వామా దాడుల వెనుక కీలక సూత్రధారిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్‌ హతమైనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు టెర్రరిస్ట్‌ హంజా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్